ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించిన FNCC

ఇటీవల వచ్చిన వర్షపాతం వల్ల కలిగిన వరదల వల్ల తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర నష్టం వాటిలింది. దానికి విచారిస్తూ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (FNCC) ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. ఈరోజు ఎఫ్ఎంసిసి ప్రెసిడెంట్ ఘట్టమనేని ఆదిశేషగిరి రావు గారు జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తమ నివాసంలో కలిసి 25 లక్షల రూపాయలు విరాళం విరాళం అందజేయడం జరిగింది.