రాష్ట్ర ప్రభుత్వాలకు యాంకర్స్ విరాళం

ఇరు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల వల్ల వచ్చిన వదరాల వలన ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టి ఎంతో వేగంగా పని చేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా విరాళాల రూపంలో ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ నుండి ఎందరో నటీనటులు తమ వంతు సాయం చేయడం చూస్తూ ఉన్నాం. అదే విధంగా చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి యాంకర్స్ సైతం తమ వంతు సాయంగా రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళం అందిస్తున్నారు. చొక్కారపు స్రవంతి ఇరు తెలుగు రాష్ట్రాలకు లక్ష రూపాయల విరాళం ఇవ్వగా యాంకర్ చందు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి గాను 25000 రూపాయలు విరాళం అందించారు. ఇదే విధంగా మరి కొందరు సినిమా పరిశ్రమ నుండి తమ వంతు సాయంగా రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళం అందిస్తు వస్తున్నారు.