Tollywood: టాలీవుడ్‌లో విషాదం.. ‘మేజ‌ర్’ చిత్ర డైరెక్ట‌ర్ తండ్రి మృతి!

Tollywood: టాలీవుడ్‌లో మ‌రో విషాదం నెల‌కొంది. టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ న‌టించిన గూఢ‌చారి చిత్ర డైరెక్ట‌ర్ శ‌శి కిర‌ణ్ తిక్క తండ్రిగారైన తిక్క సూర్య నారాయ‌ణ సోమ‌వారం రాత్రి క‌న్నుమూశారు. గూఢ‌చారి సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు డైరెక్ట‌ర్ శ‌శికిర‌ణ్. దీంతో ఆయ‌న‌కు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు అవ‌కాశం ఇచ్చాడు. మ‌హేశ్ బ్యాన‌ర్‌లో శ‌శికిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో మేజ‌ర్ సినిమా తెర‌కెక్కుతుంది.

అడివి శేషు, శ‌శి కిర‌ణ్ మ‌రోసారి హిట్ కొట్ట‌డానికి చాలా క‌ష్ట‌ప‌డుతున్నారు. ఈ సినిమా జూన్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది… ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకోగా.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అయితే డైరెక్ట‌ర్ శ‌శికిరణ్ తండ్రి మృతి ప‌ట్ల మేజ‌ర్ టీమ్‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.‌