KGF దర్శకుడితో మరోసారి చర్చలు జరిపిన తారక్

జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తరువాత త్రివిక్రమ్ ప్రాజెక్టును స్టార్ట్ చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత ఎవరితో వర్క్ చేస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. రూమర్స్ గట్టిగానే వచ్చినప్పుటికి ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఇక ఆల్ మోస్ట్ KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ తోనే జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ సెట్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి.

లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం ఇటీవల జూమ్ వీడియో కాల్ ద్వారా ఈ ఇద్దరు చాలా సేపు వారు చేయబోయే ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నారట. మెయిన్ గా కథ పరంగా జూనియర్ ఎన్టీఆర్ సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయిన తరువాతే అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ప్రశాంత్ నీల్ ప్రస్తుతం KGF 2ని ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. యష్ కథానాయకుడిగా నటిస్తున్న ఆ పాన్ ఇండియా సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.