కంగనా రనౌత్ పోరాటానికి మద్దతు ఇచ్చిన ఇండియన్ క్రికెటర్

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ మృతి చెందడం వెనుక అసలు కారణం ఏమిటనేది ఇంతవరకు తెలియలేదు. అయితే అతనికి మృతికి కారణం బాలీవుడ్ లో నెలకొన్న నెపోటిజమ్ అని కంగనా రనౌత్ పలువురిపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు కరణ్ జోహార్, మహేష్ భట్ వంటి వారిపై కంగనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

బాలీవుడ్ అగ్ర తారలపైనే కాకుండా హీరోయిన్స్ పై కూడా కంగనా ఆగ్రహం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆమెకు సెలబ్రెటీస్ నుంచి చాలా తక్కువ మద్దతు లభిస్తోంది. ఇక మొదటిసారి ఇండియన్ క్రికెటర్ మనోజ్ తివారి కంగనాకి మద్దతుగా నిలిచాడు.

cricketer-manoj-tiwary-slams-kangana-ranauts-critics