మూడు సినిమాలతో మీ ముందుకు రానున్నాను : అడివి శేష్

తెలుగు సినీ దర్శకుడు, నటుడు అడవి శేష్ అంటే తెలియని వారు లేరు. క్రైమ్, యాక్షన్, త్రిల్లర్ ఇంకా సస్పెన్స్ సినిమాలలో అడవి శేష్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవచ్చు. ఈయన ఇప్పటికే పలు చిత్రాలతో మంచి విజయాలు సాధించారు. అయితే ఈరోజు తన సోషల్ మీడియా మాధ్యమం అయిన X ద్వారా 2025 లో తన మూడు సినిమాలు రాబోతున్నట్లు అయిన తెలిపారు. వాటిలో ఒకటి 2018లో విడుదల అయిన గూడచారి సినిమాకు సీక్వెల్ G2 కాగా మరొకటి శృతిహాసన్ హీరోయిన్ గా రాబోతున్న సినిమా డెకొయిట్. అయితే మూడవ సినిమా ఏంటి అనేది తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉండగా సోషల్ మీడియాలో అడవి శేష్ అభిమానులు అమ్ముడు సినిమా ఏమై ఉండబోతుంది అంటూ ప్రశ్నిస్తున్నారు.