ఈ సారి చరణ్ ని దూరం పెట్టనున్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22న 65వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పుట్టినరోజుకి మెగాస్టార్ కి సంబంధించిన రెండు ప్రాజెక్టుల స్పెషల్ అప్డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్యకు సంబంధించిన ఒక ఎదో ఒక లుక్ వచ్చే ఛాన్స్ ఉంది.

ఇక బాబీ దర్శకత్వంలో చిరంజీవి ఒక కొత్త సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఈ సారి రామ్ చరణ్ తో కాకుండా వేరే నిర్మాతతో సినిమా చేయాలని మెగాస్టార్ ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చాక ఖైదీ నెంబర్ 150తో పాటు సైరా సినిమాకు కూడా రామ్ చరణ్ నిర్మాతగా ఉన్నాడు. ఇక ఆచార్యకు కూడా రామ్ చరణ్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే బాబీ దర్శకత్వంలో చేసే సినిమా నిర్మాణ బాధ్యతలను పూర్తిగా మైత్రి మూవీ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా ఈ విషయంపై ఒక క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.