Tollywood: పైన ప‌టారం లోన లొటారం అంటూ దుమ్ములేపుతున్న జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్‌!

Tollywood: టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఆర్ఎక్స్100 చిత్రంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించిన ఆయ‌న‌కు ఎలాంటి ఆశించిన స్థాయిలో ద‌క్క‌లేదు. ఒక‌వేళ ఆయ‌న‌కు క‌థ‌ప‌రంగా, నిర్మాణం ప‌రంగా క‌రెక్ట్ ప‌డితే కార్తీకేయం అంటే ఏంటో చూపిద్దాం అని ఉత్సాహంలో ఉంటాడు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ముఖ నిర్మాణ సంస్ధ గీతాఆర్ట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాసు నిర్మిస్తున్న చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రంలో కార్తికేయ న‌టిస్తున్నాడు.

Tollywood ఈ చిత్రంలో కార్తికేయ స‌ర‌స‌న లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రంతో నూత‌న ద‌ర్శ‌కుడిగా ప‌రియ‌మవుతున్నాడు పెగ‌ళ్ల‌పాటి కౌశిక్‌. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్ల్‌, టైటిల్ సాంగ్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఫిదా చేశాయి. కాగా తాజాగా Tollywoodఈ చిత్రం నుంచి ఐటెంసాంగ్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఇందులో హాట్ యాంక‌ర్ అన‌సూయ భ‌రద్వాజ్ ఆడిపాడింది. పైన ప‌టారం లోన లొటారం విను బాసూ చెప్తాను ఈ లోకం య‌వ్వారం అంటూ బ‌స్తీ బాల‌రాజ్ కార్తికేయ‌తో క‌లిసి అన‌సూయ రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది. ఈ ఐటెంసాంగ్ ప్ర‌ముఖ జానీ మాస్ట‌ర్ నేతృత్వంలో నిర్వహించారు. దీంట్లో పైన పటారం లోన లొటారం అనే ద‌గ్గ‌ర అన‌సూయ వేసిన మాస్ స్టెప్పులు ఎంతో అల‌రిస్తున్నాయి. ఇక ఈ Tollywoodచిత్రం మార్చి 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది‌.