Tollywood: గ‌ర్భ‌వ‌తి అయినా మిర్చి హీరోయిన్‌ ‌..

Tollywood: లీడ‌ర్ సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ‌ త్వ‌ర‌లోనే త‌ల్లి కాబోతుంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెన ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది. లీడ‌ర్ అనంత‌రం.. ర‌వితేజ‌తో మిర‌ప‌కాయ్‌, ప్ర‌భాస్‌తో మిర్చి వంటి చిత్రాల్లో హీరోయిన్ న‌టించి ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది రిచా. అలాగే నాగార్జున‌తో భాయ్ చిత్రంలో న‌టించింది. ఈ Tollywoodసినిమాల్లో త‌న అందంతో పాటు అభిన‌యంతో సినీ ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసింది.

కాగా 2013లో విడుద‌లైన భాయ్ Tollywoodచిత్రం త‌ర్వాత రిచా తెలుగు ఇండ‌స్ట్రీకి దూర‌మైన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ఆమె పుట్టిన స్థ‌లం ఆమెరికాకు వెళ్లి అక్క‌డ‌నే ఎంబీఏ పూర్తి చేసింది. కానీ సినిమాల‌కు దూరంగా ఉన్నా త‌న జీవిత విష‌యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా తెలుపుతుంది. రెండేళ్ల క్రితం త‌న బాయ్‌ఫ్రెండ్ అయినా జియో లాంజెల్‌ను పెళ్లి చేసుకుంది రిచా. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో తెలిపింది. ఇక తాజాగా ఆమె త్వ‌ర‌లోనే త‌ల్లి కాబోతుంది. ఈ విష‌యాన్ని రిచా ఒక ఫోటోను పోస్ట్ చేస్తూ తెలిపింది. ఇందులో త‌న భ‌ర్త రిచా నుదుటిపై ముద్దు పెడుతున్నాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.