సాయి కృష్ణ ఆధ్వర్యంలో సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2 సాఫ్ట్ పోస్టర్ లాంచ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు

టి సి ఏ నిర్వహిస్తున్న సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 1 ఫిబ్రవరిలో నిర్వహించారు. అది పెద్ద సక్సెస్ అవడంతో ఇప్పుడు సీజన్ 2 ని నవంబర్ లో నిర్వహిస్తున్నారు. ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ కి చారిటీ కోసం తెలుగు సినీ సెలబ్రిటీస్ ఈ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2 కి సంబంధించిన సాఫ్ట్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పోస్టర్ లంచ్ కార్యక్రమంలో ఫౌండర్ సాయికృష్ణ, తెలుగు సినీ హీరోలు శ్రీకాంత్, తరుణ్, అశ్విన్ బాబు, సుశాంత్, ఆది సాయికుమార్, సామ్రాట్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఆర్టిస్ట్ భూపాల్ మరియు ఓంకార్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ గారు మాట్లాడుతూ : టి సి ఏ 2006లో స్థాపించారు. ఇలా సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ద్వారా క్రికెట్ మ్యాచ్ ఆర్గనైజ్ చేసి చారిటీ ద్వారా సహాయం అందిస్తున్న సాయి కృష్ణ గారికి మా అందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా దేశాల్లో క్రికెట్ మ్యాచ్లు జరిగాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సీజన్ 1 ఆడాము. ఒకే సంవత్సరంలో రెండు సీజన్లు నిర్వహించడం అనేది అంత ఈజీ కాదు. సీజన్ 1 పెద్ద సక్సెస్ అవ్వడం వల్ల నవంబర్లో సీజన్ 2 నిర్వహిస్తున్నారు. ఆయనకు సినిమా అనుభవం కూడా ఉంది. ఇంతమంది సెలబ్రిటీస్ ని తీసుకెళ్లి ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ ఆడించడం అంత ఈజీ కాదు. అలాంటిది సీజన్ 2 నిర్వహిస్తున్నారు. ఈ నవంబర్ 15, 16 జరిగే ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ : టి సి ఎ ఎప్పుడు క్రికెట్ మ్యాచెస్ పెట్టిన క్రికెట్ కాకుండా దానికి ఒక మంచి కారణం కూడా ఉంటుంది. ఫిబ్రవరిలో సీజన్ 1 ఆడినప్పుడు ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ చారిటీ కోసం ఆడం. ఈ సీజన్ టు కూడా అదే మంచి కారణం కోసం ఆడడం మంచి విషయం. సినిమా ప్రమోషన్స్ వల్ల కొంతమంది రాలేకపోయారు. కర్టెన్ రైజర్ ఈవెంట్ కి అందరూ వస్తారు.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ : మాకు ఉన్న స్ట్రెస్ కి ఒక రిలీఫ్ గా ఫీల్ అయ్యేది క్రికెట్ మ్యాచ్. ఈవినింగ్ వర్క్ అయిపోయాక మేము అందరం కలుసుకునేది క్రికెట్ గ్రౌండ్ లోనే. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా వెళ్లి సీజన్ 1 ఆడి వచ్చాము. ఆస్ట్రేలియాలో మాకొచ్చిన రిసెప్షన్ చూసి ఆశ్చర్యం వేసింది. సాయి గారు ఇంత గ్రాండ్ గా ఒక చారిటీ కోసం సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. సీజన్ 1 ఎలా అయితే సక్సెస్ అయిందో సీజన్ 2 కూడా అంతే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

ఓంకార్ గారు మాట్లాడుతూ : ఒక మంచి చారిటీ కోసం సాయి కృష్ణ ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ని లాంచ్ చేశారు. సీజన్ 1 పెద్ద సక్సెస్ అయింది. ఆస్ట్రేలియాలో సీజన్ 1 కి వెళ్ళినప్పుడు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఇప్పుడు అదే చారిటీ కోసం సీజన్ 2 నిర్వహిస్తున్నారు. సీజన్ 2 కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో తరుణ్ మాట్లాడుతూ : సాయి కృష్ణ గారు ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ చారిటీ కోసం ఆర్గనైజ్ చేయడం చాలా మంచి విషయం. ఇప్పటివరకు ఆడిన ఏ చారిటీ మ్యాచ్ కూడా మనం ఓడిపోలేదు. ప్రతి మ్యాచ్ గెలుస్తూనే ఉన్నాం. సీజన్ 1 లో కూడా గెలిచాం. ఈ సీజన్ 2 కూడా గెలిచి ట్రోఫీ లిఫ్ట్ చేస్తాము అని కచ్చితంగా చెప్తున్నాను. ద రాయల్ చిల్డ్రన్ హాస్పిటల్ మెల్బోర్న్ కి చారిటీ కోసం ఆడుతున్నాం. ఇక్కడున్న మా అందరికీ క్రికెట్ అంటే చాలా ఇష్టం. నవంబర్ లో జరిగే ఈవెంట్ కి సెప్టెంబర్ లో కర్టెన్ రైజర్ కార్యక్రమం ఉంటుంది. ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2 కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో సుశాంత్ మాట్లాడుతూ : శ్రీకాంత్ గారు తరుణ్ చారిటీ కోసం టి సి ఏ తరఫున ఎప్పటినుంచో క్రికెట్ ఆడుతున్నారు. ఇప్పుడు దాంట్లో నేను భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఆర్గనైజర్ సాయి గారు సీజన్ 1 టైం లో మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఒక చారిటీ కోసం ఇలా క్రికెట్ మ్యాచ్ ఆడడం చాలా మంచి విషయం. సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను. సీజన్ 1 లా సీజన్ 2 కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ : ఫిబ్రవరిలో సీజన్ 1 ఆడాము. సాయి గారు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఇప్పుడు సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నాము. ఇలా సీజన్ 2 సంబంధించిన పోస్టర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. నన్ను కూడా ఈ చారిటీ క్రికెట్ మ్యాచ్ లో భాగం చేసినందుకు తరుణ్ అన్నకు శ్రీకాంత్ అన్నకు కృతజ్ఞతలు. సీజన్ 2 కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో సామ్రాట్ మాట్లాడుతూ : ఇక్కడున్న మా అందరికీ క్రికెట్ అంటే ఇష్టం. మేమందరం సినిమా పరంగా ఎక్కువ కలవకపోయినా క్రికెట్ గ్రౌండ్లో కచ్చితంగా కలుస్తాం. ఇప్పుడు చారిటీ కోసం క్రికెట్ మ్యాచ్ ఆడడం ఆనందంగా ఉంది. సీజన్ 2 సీజన్ 1 కంటే పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ఫౌండర్ సాయి కృష్ణ గారు మాట్లాడుతూ : ఫిబ్రవరిలో సీజన్ 1 నిర్వహించాం. హీరో శ్రీకాంత్ గారు హీరో తరుణ్ గారు ముందు నుంచి ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు. ఈ సెలబ్రిటీస్ అందరూ ఎంతో బిజీగా ఉన్నా చారిటీ కోసం వచ్చి క్రికెట్ ఆడి సపోర్ట్ చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.