సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ పై కేసు నమోదు

టాలీవుడ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రాబోతున్న చిత్రం డబల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వల్ గా ఈ చిత్రం ఉండబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్ ఇంకా పాట మంచి బజ్ క్రియేట్ చేశాయి. అలాగే ఈ చిత్రం నుండి ఐటెం సాంగ్ ‘మారు ముంత చోడ్ చింత’ విడుదల కావడం జరిగింది. అయితే ఆ పాట లిరిక్స్ లో ‘ఏం చేద్దాం అంటావ్ మరి’ అనే ఓ వాక్యం ఉపయోగించడం జరిగింది. ఈ వాక్యాన్ని ఎక్కువగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఉపయోగిస్తుంటారు. కాబట్టి ఒక ఐటెం సాంగ్ లో ఆ వాక్యాన్ని ఉపయోగించడం తమకు ఇబ్బందిగా ఉందని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అలాగే కేసీఆర్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైన రజితా రెడ్డి, సతీష్ కుమార్ ఎల్బీనగర్ డిఎస్పి కి కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే దీనిపై యాక్షన్ తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే గతంలో ఎందరో సెలబ్రిటీలు వాడే కొన్ని వ్యాఖ్యలతో పదాలతో పాటలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.