Tollywood: ఉప్పెన క‌థ‌కు ముందుగా ఆ హీరో అనుకున్నా: బుచ్చిబాబు

Tollywood: మెగా కాంపౌండ్ నుంచి వ‌స్తున్న‌ మ‌రో హీరో వైష్ణ‌వ్ తేజ్‌. ఆయ‌న న‌టించిన చిత్రం ఉప్పెన నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అయి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఇందులో వైష్ణ‌వ్‌కు జోడీగా కృతిశెట్టి త‌న అందంతో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసింది. త‌న హావాభావాల‌తో త‌న ముద్దు ముద్దు మాట‌ల‌తో ఈ చిత్రంపై హైప్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో త‌మిళ ప్ర‌ముఖ న‌టుడు మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్‌సేతుప‌తి న‌టించ‌గా..త‌న‌ అద్భుత‌మైన ప‌ర్ఫార్మెన్స్‌తో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేశారు.

Tollywood ప్ర‌ముఖ ద‌ర్శకుడు సుకుమార్ ద‌గ్గ‌ర ప‌నిచేసిన స‌హాయ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. అయితే డైరెక్ట‌ర్ బుచ్చిబాబు ఇటీవ‌లే ఈ సినిమా గురించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని తెలిపాడు.. ఉప్పెన కథ రాసుకునే టైంలో ఎక్క‌డో ఓ ద‌గ్గ‌ర హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను అనుకున్నాన‌ని సంచ‌ల‌న నిజం బ‌య‌ట‌పెట్టాడు. Tollywood కానీ క‌థ పూర్త‌య్యాక వైష్ణ‌వ్ తేజ్‌నే ఫైన‌ల్ చేసిన‌ట్లు తెలిపాడు. అయితే విజ‌య్‌దేవ‌ర‌కొండ‌ను ఎందుకు తీసుకోలేదు అంటే.. ఆయ‌న ఇప్పుడు స్టార్‌డ‌మ్‌లో ఉన్నాడు. ఆ స్థాయిలో ఉన్న హీరోకు నా క‌థ సెట్ అవ్వ‌ద‌ని అనిపించింది. అందుకే విజ‌య్ ను తీసుకోలేద‌ని వివ‌ర‌ణ ఇచ్చాడు Tollywood డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా.