ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పై బ్రహ్మాజీ కామెంట్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలలో NDA కూటమి గెలిచింది. వైసీపీ ప్రభుత్వం కేవలం 11 MLA సీట్లకే పరిమితమై గోరా ఓటమిని పొందింది. ఇది ఇలా ఉండగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ గొడవలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో పార్టీ కార్యకర్తల గొడవల వాళ్ళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల మీద మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రస్తుత పరిస్థితులు చక్కపెట్టాలి అంటూ తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇది ఇలా ఉండగా నటుడు బ్రహ్మాజీ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ సురక్షితమై చేతులలో ఉందని, భవిష్యత్ పై దృష్టి పెట్టమని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని ఉద్దేశించి గత ప్రభుత్వం వారు తప్పు చేసారని, అందుకే ఇప్పుడు వారు ఓడిపోయినట్లు,ఇప్పటి ప్రభుత్వం కూడా అదే తప్పు చేయకండి అన్నారు. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి తేడా ఉండాలని అన్నారు.