తల్లి కాబోతున్న అతిథి హీరోయిన్

టాలీవుడ్ లో మహేష్ బాబు నటించిన అతిథి సినిమాలో హీరోయిన్ గా నటించిన అమృత రావ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. అయితే ఈ బ్యూటీ చాలా రోజుల తరువాత ఎవరు ఊహించని విధంగా ఒక హాస్పిటల్ ముందు దర్శనమిచ్చింది. ముంబైలోని ఒక క్లినిక్ వద్ద తన భర్తతో నిలబడి మాట్లాడుతున్న అమృత బేబీ బంప్ తో దర్శనమిచ్చింది.

వివరాల్లోకి వెళితే.. అమృత, అన్మోల్ తో 7 సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తరువాత 2016 లో వివాహం చేసుకుంది. వీరు చాలా రహస్యంగా వివాహం చేసుకున్నారనే చెప్పాలి. కేవలం కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు మాత్రమే వారి పెళ్లిలో పాల్గొన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తల ప్రకారం, నటికి అమృత తన జీవితంలో చాలా సంతోషంగా ఉందట. త్వరలోనే తల్లి కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నట్లు మీడియాకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక అమృత రావ్ అతిథి సినిమా తరువాత మళ్ళీ తెలుగులో నటించలేదు. ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే నటించింది. చివరగా 2019లో థాక్రే సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించింది.