బ్రేక్ ఈవెన్ మార్క్‌కు చేరుకున్న అల్లుడు అదుర్స్

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన అల్లుడు అదుర్స్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. కలెక్షన్ల పరంగా తొలి వీకెండ్ నాటికి బ్రేక్ ఈవెన్ సాధించిందని నిర్మాత బెల్లంకొండ సురేష్ తెలిపారు.

Alludu Adhurs Reaches Breakeven

తొలి నాలుగురోజుల్లో రూ.12.25 కోట్ల షేర్ సాధించి బ్రేక్ ఈవెన్ మార్క్‌కు చేరుకుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వినిపించింది. అయినా సంక్రాంతి సందర్భంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. అందులో భాగంగానే సంక్రాంతి సీజన్ అల్లుడు అదుర్స్ సినిమాకు కలిసొచ్చింది.

నభా నటేష్, అను ఇమ్మానుయేల్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా.. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్‌పై ఈ సినిమా తెరకెక్కింది. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.