Geetha Arts: క‌రోనా బారిన ప‌డ్డ నిర్మాత‌ అల్లు అరవింద్.. వ్యాక్సిన్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Geetha Arts: ప్ర‌ముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అర‌వింద్ క‌రోనా బారిన ప‌డ్డారు. తాజాగా ఈ విష‌యాన్ని తానే స్వ‌యంగా ఓ వీడియో ద్వారా తెలిపారు. ఆ వీడియోలో ఆయ‌న మాట్లాడుతూ.. నాకు క‌రోనా వ‌చ్చింద‌ని ఈ మ‌ధ్య వ‌చ్చిన వార్తాలపై స్పందించాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. నాకు క‌రోనా వ‌చ్చింద‌నే మాట వాస్త‌వం.. కానీ రెండు సార్లు క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత కూడా క‌రోనా వ‌చ్చింద‌ట అని వార్తాలు రాస్తున్నారు. ఇది త‌ప్పు.. అస‌లు విష‌యం ఏంటంటే..

Producer Allu Aravind Gives Clarifies About Vaccination | Tollywood News | TFPC

ఒక వ్యాక్సిన్ డోస్ తీసుకున్ననేను ఇద్ద‌రు స్నేహితుల‌తో ఓ ఊరెళ్లి వ‌చ్చిన అనంత‌రం.. క‌రోనా వచ్చింద‌ని తెలుసుకున్నాను కొద్దిగా జ్వ‌రం అనిపించింది అయితే మా ముగ్గురిలో ఒక వ్య‌క్తి క‌రోనా వ్యాక్సిన్ తీసుకోలేదు అత‌డికి క‌రోనా వ‌చ్చి ఆస్ప‌త్రిలో చేరాడు. కానీ నేను ఇంకో మిత్రుడు క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్నాం కాబ‌ట్టి లైట్‌గా వ‌చ్చింది. కాబ‌ట్టి అర్డులైన ప్ర‌తి ఒక్క‌రు వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు.‌‌