గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సినీ నటి హేమల్

అనంతరం మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని సినీ నటి హేమల్ అన్నారు. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సినీ హీరో రాజ్ తరుణ్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ సినీ నటి హేమల్ గచ్చిబౌలి లో మొక్కలు నాటారు.అనంతరం మరో ఇద్దరు( ఫ్యాషన్ డిజైనర్ మేఘన , డిఒపి సంజోసాఫ్ )లు కూడా గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని సినీ నటి హేమల్ పిలుపునిచ్చారు..