
ఈషా రెబ్బా, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ త్రీ రోజెస్. ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన ఈ సిరీస్ కు ఇప్పుడు సీజన్ 2 రాబోతోంది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు.
ఈ రోజు త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో రాశీ సింగ్ క్యారెక్టర్ ను ట్రెడిషనల్ గా పరిచయం చేస్తూ, మోడరన్ గా టర్న్ అయిన ట్విస్ట్ చూపించారు. ఆమె ఎందుకు ట్రెడిషనల్ నుంచి మోడరన్ గా మారింది అనేది గ్లింప్స్ లో ఆసక్తి కలిగిస్తోంది. త్రీ రోజెస్ సీజన్ 2 లో ఒక రోజ్ గా రాశీ సింగ్ క్యారెక్టర్ ఆకట్టుకోనుంది. ఇప్పటికే త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి రిలీజ్ చేసిన హీరోయిన్ ఈషా రెబ్బా, కుషిత కల్లపు గ్లింప్స్ లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.