గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు గెలిచిన హీరోయిన్ హేమలత రెడ్డి బతుకమ్మ పండుగ దాండియా ఆడారు

జెమినీ టీవీ యాంకర్ గా చేసి, నిన్ను చూస్తూ సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హేమలత రెడ్డి ఇటీవలే గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు – బెస్ట్ టాలెంట్ మరియు బెస్ట్ ఫోటోజెనిక్ ఉప శీర్షికలు మీద అవార్డు అందుకున్నారు.

కాగా బతుకమ్మ పండగ నేపథ్యంలో హైదరాబాదులో చాలాచోట్ల దాండియా ఈవెంట్స్ గ్రాండ్ గా జరిగాయి. అందులో హీరోయిన్ హేమలత రెడ్డి ఏ పి ఆర్ ప్రవీన్స్ లగ్జరియస్ విల్లాస్, పటాన్చెరు మరియు గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన దాండియా ఈవెంట్లో పాల్గొని సందడి చేశారు. గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు గెలిచిన తర్వాత ఆమె పాల్గొన్న ఈ ఈవెంట్లో అందరూ ఆమెని ప్రశంసించారు. అదేవిధంగా హేమలత రెడ్డి అందరితో చాలా సరదాగా దాండియా సంబరాల్లో పాల్గొని దాండియా ఆడారు.