నటుడు రాజేంద్రప్రసాద్ ను కలిసి పరామర్శించిన ప్రభాస్

ఇటీవలే నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎంతోమంది సినీ పరిశ్రమకు చెందిన వారు రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శిస్తున్నారు. అదేవిధంగా రెబల్ స్టార్ ప్రభాస్ ఈరోజు కూకట్పల్లిలోని రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్లి రాజేంద్రప్రసాద్ ని పరామర్శించడం జరిగింది. ఆపై రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది.