హీరో కార్తీపై ఫైరయిన పవన్ కళ్యాణ్

‘సత్యం సుందరం’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో లడ్డూపై హీరో కార్తి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైరయ్యారు. ‘లడ్డూ మీద జోక్స్ వేస్తున్నారు. ఓ సినిమా ఈవెంట్లో లడ్డూ అనేది సెన్సిటివ్ ఇష్యూ అని ఓ హీరో అన్నారు. మళ్లీ ఇంకోసారి అలా అనొద్దు. యాక్టర్గా మీరంటే నాకెంతో గౌరవం. సనాతన ధర్మాన్ని గౌరవించండి. ఏదైనా మాట్లాడేముందు వందసార్లు ఆలోచించండి’ అని సూచించారు.

కాగా నిన్న రాత్రి తమిళ హీరో కార్తీ తన సినిమా సత్యం సుందరం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదెరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో లడ్డు అనే మీమ్ పై స్పందిస్తూ ఇది చాలా సెన్సిటివ్ విష్యం అని, దాని గురించి మాట్లాడాను అని హీరో కార్తీ అన్నారు.