తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్ హీరోయిన్

తెలుగులో ఎన్నో చిత్రాలలో హీరోయిన్ గా నటించి ఇప్పుడు బాలీవుడ్ లో స్థిరపడ్డ హీరోయిన్లు ఎందులో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు తాప్సీ పన్ను. మిస్టర్ పర్ఫెక్ట్, షాడో, వీర, గుండెల్లో గోదారి, ఆనందో బ్రహ్మ తదితర తెలుగు చిత్రాలలో నటించిన తాప్సి పన్ను ఆ తర్వాత బాలీవుడ్కు వెళ్లడం జరిగింది. యాత్ర, యాత్ర 2 వంటి పొలిటికల్ సీక్వెల్ సినిమాలు తీసిన దర్శకుడు మహి వి రాఘవ. ఆనందో బ్రహ్మ అనే సినిమా దర్శకత్వం చేసింది ఈ దర్శకుడు అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ ఆనందో బ్రహ్మ అనే హారర్ జోనల్ లో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ తీసే ప్లాన్లో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సీక్వెల్ కు నటించమని తాప్సీ పన్ను ని అడగగా ఆమె ఒకే చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లు మొదలైనట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన వస్తుందని సమాచారం.