తరుణ్ భాస్కర్ డోలాముఖి సబ్‌బల్ట్రాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ నంబర్ 2 అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్

యారో సినిమాస్, డోలాముఖి సబ్‌బల్ట్రాన్ ఫిల్మ్స్ తమ లేటెస్ట్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాయి. ఇది రెండు నిర్మాణ సంస్థలకు సెకండ్ ప్రొడక్షన్ వెంచర్‌. వెరీ ట్యాలెంటెడ్ తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో చేస్తున్న ఈ కంప్లీట్ ఎంటర్ టైనర్ తో వంశీరెడ్డి దొండపాటిని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 

ప్రముఖ రైటర్, డైరెక్టర్ వేణు ఊడుగుల అడిషినల్ కంట్రిబ్యూషన్ తో బూసం జగన్ మోహన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంటర్ టైన్మెంట్, ఎమోషనల్ డెప్త్ తో కూడిన అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ బ్యానర్స్‌పై రెండో ప్రొడక్షన్‌గా ఈ చిత్రం కథాపరంగా, ప్రొడక్షన్ క్యాలిటీలో న్యూ స్టాండర్డ్స్ ని సెట్ చేయడానికి సిద్ధంగా ఉంది.

శ్రీనివాస్ గౌడ్ అనే పాత్రను అతని భార్య శ్రీలత నుంచి విడాకులు తీసుకున్నట్లు సూచించే స్టాంప్ పేపర్‌తో యూనిక్ స్టయిల్ లో అనౌన్స్మెంట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. కొత్త టాలెంట్‌ని డిస్కవర్ చేయడానికి నటీనటుల కోసం టీమ్ ఓపెన్ కాస్టింగ్ కాల్‌ని అనౌన్స్ చేసింది. ఈ సినిమా టెక్నికల్ టీం, ఇతర వివరాలు మేకర్స్ త్వరలోనే తెలియజేస్తారు. 

నటీనటులు: తరుణ్ భాస్కర్

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: వంశీరెడ్డి దొండపాటి

నిర్మాతలు: బూసం జగన్ మోహన్ రెడ్డి & వేణు ఊడుగుల

బ్యానర్స్: యారో సినిమాస్ & డోలాముఖి సబ్‌బల్ట్రాన్ ఫిల్మ్స్

పీఆర్వో: వంశీ-శేఖర్