హీరో రాజ్ తరుణ్ పై కన్నెర్ర చేసిన పోలీసులు

హీరో రాజ్ తరుణ్, లావణ్యాల విషయం కొన్ని రోజులుగా వార్తలలో చూస్తూనే ఉన్నాము. కొద్దిరోజుల క్రితం లావణ్య అనే యువతి హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. అయితే ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వకపోవడంతో పోలీసులు అ కేసుని అంగీకరించలేదు. ఆ తరువాత రాజ్ తరుణ్ తనతో కొద్ది కాలంగా కలిసి ఉన్నాడని, ఆ తర్వాత ఒక హీరోయిన్ తో ఉంటున్నాడని లావణ్య అన్నారు. అలాగే తాము ఇద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు కూడా తెలిపారు. లావణ్య రాజ్ తరుణ్ వల్ల అబార్షన్ కూడా చేయించుకున్నానని చెప్పారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం రాజ్ తరుణ్ నటించిన తిరగబడతారాసామి సినిమా హీరోయిన్ తనకు సంబంధం లేకుండా తనను ఈ గొడవల్లో లాగుతున్నారని లావణ్య పై కేసు పెట్టింది. అయితే పూర్తి వివరాలతో రాజ్ తరుణ్ పై లావణ్య కేసు పెట్టడం జరిగింది. ఈనెల 18 లోపు హీరో రాజ్ తరుణ్ ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని ఆదేశించడం జరిగింది. అయితే బి ఎన్ ఎస్ ఎస్ పార్టీలకు నోటిఫికేషన్ జారీ చేయడం కూడా జరిగింది. ఇకపై ఈ కేసు ఎటువైపు వెళుతుంది అనేది వేచి చూడాల్సి ఉంది.