‘విశ్వంభర’ డబ్బింగ్ ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్టైనర్ ‘విశ్వంభర’ సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. షెడ్యూల్ ప్రకారం సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. తాజాగా మేకర్స్ సినిమా డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు.

ఈ సినిమాలో అత్యున్నత స్థాయి వీఎఫ్‌ఎక్స్ ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి తగినంత సమయం పడుతుంది. దాంతో ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, హనుమాన్ కి గొప్ప భక్తుడిగా కనిపించనున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లు అద్భుతంగా ఉండబోతున్నాయి. దర్శకుడు వశిష్ట సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విశ్వంభర 2025 జనవరి10న విడుదల కానుంది.

తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వశిష్ట
నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: ఎంఎం కీరవాణి
డీవోపీ: చోటా కె నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో