Nagarjuna: క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్న నాగ్‌..

Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున తొలిసారిగా క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విష‌యాన్ని నాగార్జున త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశారు. నిన్న క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్నాన‌ని.. అర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకువాల‌ని సూచించారు. ముందుగా ఆన్‌లైన్ వేదిక‌గా వ్యాక్సిన్ కోసం పేర్ల‌ను రిజిస్ట‌ర్ చేసుకోవాల‌ని తెలిపారు.

Nagarjuna

హైద‌రాబాద్‌లోని స్టార్ ఆసుప‌త్రిలో Nagarjuna ఆయ‌న క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న‌ట్లు పేర్కొన్నారు. ఇక దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి.. ఈ నేప‌థ్యంలో ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు క‌రోనా వ్యాక్సిన్ డోస్ వేయించుకుంటున్నారు. సామాన్య ప్ర‌జ‌లు కూడా ఈ క‌రోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.