కరోనా పాజిటివ్ వచ్చినా బయటకు చెప్పకుండా వైరస్ ని కిల్ చేసిన స్టార్ హీరోయిన్ ‘జెనీలియా దేశ్ ముఖ్’!!

కరోనా వైరస్ రోజురోజుకి ఏ స్థాయిలో విజృంభిస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వేల సంఖ్యలో కనిపించిన పాజిటివ్ కేసులు చూస్తుండగానే లక్షల్లోకి పెరుగుతున్నాయి. ఇక సినిమా ఇండస్ట్రీలో ఎంతో జాగ్రత్తలు తీసుకునే స్టార్ సెలబ్రెటీలు కూడా కరోనా వైరస్ భారిన పడుతున్నారు. ఇక రీసెంట్ గా స్టార్ హీరోయిన్ జెనీలియా దేశ్ ముఖ్ కి కరోనా వైరస్ సోకింది. అయితే ఆమె ఏ మాత్రం హడావుడి చేయకుండా వైరస్ ని చాలా సైలెంట్ గా కిల్ చేసింది.

సోషల్ మీడియా ద్వారా స్పందించిన జెనీలియా ఈ విధంగా వివరణ ఇచ్చింది. 21రోజుల క్రితమే నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఇన్ని రోజులు నేను ఒంటరిగానే గడపటం చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. బోర్ కొట్టకుండా డిజిటల్ వరల్డ్ లోనే ఎక్కువగా ఉన్నాను. అది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక రీసెంట్ గా మారోసారి నిర్వహించిన టెస్ట్ లో కరోనా నెగిటివ్ అని తేలింది. మళ్ళీ నా ఫ్యామిలీకి దగ్గరవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అనుమానం ఉంటే వెంటనే చెక్ చేయించుకోండి. వైరస్ రాకుండా ఉండాలంటే ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకొని ఫిట్ గా ఉండడం ఒక్కటే మార్గమని జెనీలియా వివరణ ఇచ్చారు.