
నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్, రాజ్యసభకు నామినేట్ అయిన సందర్భంగా తన చిరకాల స్నేహితుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ను చెన్నైలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తన కొత్త రాజకీయ ప్రయాణం గురించి స్నేహితుడితో పంచుకున్నట్లు కమల్ తెలిపారు. ఈ సందర్భంగా రజినీకాంత్తో కలిసి దిగిన ఫొటోలను కమల్ తన X వేదికపై పోస్ట్ చేశారు, ఇవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కమల్ను రజినీ అభినందించి, ఈ కొత్త ప్రయాణంలో శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ చిత్రంలో నటిస్తున్నారు.


