సినీ కార్మికుల సంక్షేమార్ధం అమ‌ర‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ తరఫున నిర్మాత ప‌ద్మావ‌తి గ‌ల్లా 10 లక్షల రూపాయల విరాళం

కరోనా కల్లోలం వల్ల రోజువారీ అవసరాలకు ఇబ్బంది పడుతున్న సినీ కార్మికుల కోసం ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీ సిసిసి కి అమ‌ర‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ తరఫున నిర్మాత ప‌ద్మావ‌తి గ‌ల్లా 10 లక్షల రూపాయల విరాళం అందించారు. గుంటూరు ఎంపీ జ‌య‌దేవ్ గ‌ల్లా కుమారుడు అశోక్ గ‌ల్లా ను హీరోగా పరిచయం చేస్తూ అమ‌ర‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు. నిర్మాత ప‌ద్మావ‌తి గ‌ల్లా మాట్లాడుతూ, లాక్‌డౌన్ నేప‌థ్యంలో అంద‌రూ ఇళ్ల‌ల్లో సుర‌క్షితంగా ఉండాల‌ని కోరారు. ప్ర‌భుత్వాలు, డాక్ట‌ర్లు, పోలీసులు చెబుతున్న స‌ల‌హాలు, సూచ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటిస్తూ క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధంలో భాగ‌స్వాములు కావాల‌న్నారు.