జగన్‌కు బిగ్ షాక్.. కొత్త పార్టీపై షర్మిల మంతనాలు.. రేపు కీలక సమావేశం

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు షాక్ తగలనుందా?.. జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టనుందా?.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. వైసీపీలో షర్మిలకు సీఎం జగన్ సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా షర్మిలను జగన్ మరింత దూరం పెట్టారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం షర్మిల విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పట్టించుకోకపోవడంతో షర్మిల అసంతృప్తితో ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

YS SHARMILA NEW PARTY

ఈ క్రమంలో షర్మిల కొత్త పార్టీ పెట్టనుందనే ప్రచారం గత కొద్దిరోజులుగా జరుగుతోంది. అందులో భాగంగా రేపు హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో వైఎస్ షర్మిల కీలక సమావేశం పెట్టనుందట. తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చించేందుకు షర్మిల ఈ సమావేశం నిర్వహిస్తుందని వినికిడి. ఈ సమావేశానికి రావాల్సిందిగా పలువురు నేతలను షర్మిల స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 9న అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, విజయమ్మల పెళ్లి రోజు సందర్భంగా ఈ పార్టీ ప్రకటన ఉండవచ్చని సమాచారం.