రష్మిక అప్పుడే కొండెక్కి కూర్చుంది… కోరినంతా ఇస్తారా?

రష్మిక మందన… ఈ మధ్య సౌత్ ఇండస్ట్రీలో జపం చేస్తున్న పేరు. ఈ కన్నడ బ్యూటీ చేస్తున్న సినిమాలు అన్నీ వరస పెట్టి హిట్స్ అవుతుండటంతో దర్శకనిర్మాతలు, హీరోలు… రష్మిక వెంట పడుతున్నారు. వరసగా వస్తున్న ఆఫర్లు.. హిట్లలతో ఈ బ్యూటీ తన రెమ్యునరేషన్ రేంజ్ ను పెంచిందని టాక్. రష్మిక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరూ సినిమా చేస్తుంది. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. దీంతో పాటు ఈ బ్యూటీ చేతిలో కోలీవుడ్‌లో రెండు, టాలీవుడ్‌లో రెండు, కన్నడలో రెండు సినిమాలు ఉండటంతో రెమ్యూనరేషన్‌ను మరింతగా డిమాండ్‌ చేస్తుందట.

తెలుగులో మహేశ్ పక్కన నటిస్తున్న రష్మిక, తమిళంలో విజయ్ 64 వ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ దక్కించుకుంది. ఇందులో రాశి ఖన్నా మరో హీరోయిన్ గా నటిస్తుంది… వరుసగా టాప్ హీరోలతో నటిస్తుండడంతో రెమ్యూనరేషన్‌ రేటు కూడా పెంచేసినట్టు తెలుస్తోంది. నిన్నమొన్నటి వరకూ 50 లక్షలకు కాస్త అటూ ఇటూగా డిమాండ్ చేసిన రష్మిక ఇప్పుడు ఏకాంగా ఒక సినిమాకు కోటి కావాలని కూర్చొందట. అటు సీనియర్ల నుంచి ఇటు జూనియర్ హీరోలు అందరూ రష్మికనే కావాలని డిమాండ్ చేస్తుండడంతో అమ్మడు కొండెక్కి కూర్చొంది. ఈ సినిమాలు హిట్ అయితే మాత్రం రష్మిక టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ లిస్ట్ చేరిపోవడం ఖాయం.