అల్లు, నందమూరి కుటుంబ వారసులు కలిసి నటిస్తే సంచలనమే…

శాకుంతలం… గుణశేఖర్ సంకల్పించిన భారి ప్రాజెక్ట్. స్టార్ హీరోయిన్ సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ మెయిన్ లీడ్స్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. మహాభారత కథలోని దుష్యంత మహారాజు, శకుంతల దేవిల ప్రేమ కథ ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు ఆర్హ గెస్ట్ రోల్ లో నటించనుందనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. శాకుంతల, దుష్యంతల కుమారుడు భారత రాజుగా ఆర్హ కనిపించనుంది. భారి ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ కూడా ఒక రోల్ లో నటిస్తున్నాడు అనే ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. గుణశేఖర్, అభయ్ రామ్ చేయాల్సిన పాత్రలోనే ఆర్హని తీసుకున్నడా లేక అభయ్ రామ్ కోసం సెపరేట్ రోల్ ఉందా అనేది తెలియాలి అంటే కొన్ని మరి కొన్ని రోజులు ఆగాలి.

ఒకవేళ అభయ్ రామ్ కూడా శాకుంతలం సినిమాలో ఉన్నాడు అంటే అది నిజంగా ఒక స్పెషల్ న్యూస్ ఏ అవుతుంది. అల్లు అర్జున్ ఎన్టీఆర్ ని బావ అని ప్రేమగా పిలుస్తాను అని చాలా సార్లు ఓపెన్ గానే చెప్పాడు కానీ బన్నీ తారక్ ఇప్పటివరకూ కలిసి నటించలేదు. ఈ శాకుంతలం సినిమాతో అల్లు అర్జున్ కూతురు, ఎన్టీఆర్ కొడుకు కలిసి నటిస్తే అది రెండు కుటుంబాలకి, వారి అభిమానులకి పక్కా ఒక మెమొరబుల్ మూవీ అవుతుంది. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లో చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తూ మెగా నందమూరి అభిమానులకి ఒక స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఆర్హ, అభయ్ రామ్ ని కూడా గుణశేఖర్ తెరపై కలిపి చూపిస్తే బాక్సాఫీస్ దెగ్గర శాకుంతలం సినిమాకి ఇంకొన్ని కోట్లు ఎక్కువ వచ్చినట్లే.