మెగాస్టార్ ‘లూసీఫర్‌’లో హీరోయిర్ ఎవరంటే?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం కొరటాల శివ ఆచార్య అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీని షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీని తర్వాత లూసీఫర్ రీమేక్‌లో చిరు నటించనుండగా.. ఈ సినిమా తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై బాబీ తెరకెక్కించనున్న సినిమాలో చిరు నటించనున్నాడు.

chiru lucifer remake

అయితే చిరు-బాబీ కాంబినేషన్‌లో రానున్న సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లను యూనిట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరు అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం చిరు నటిస్తున్న ఆచార్య సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో రాంచరణ్ కీలక పాత్రలలో నటిస్తున్నాడు. రాంచరణ్ సరసన పూజాహెగ్దే హీరోయిన్‌గా నటించనుంది.