రియా కోసం టాప్ డైరెక్టర్ సరికొత్త ప్లాన్.. PR టీమ్ ద్వారా ఫ్రెండ్లీ న్యూస్ ఛానెల్స్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిచెంది రెండు నెలలు పూర్తయినా కూడా ఘటనకు సంబంధించిన మిస్టరీ ఇంకా వీడలేదు. రోజుకో కొత్త విషయం జనాల్లో కొత్త తరహా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. కేసులో కీలకంగా మారిన రియా చక్రవర్తి సీబీఐ విచారణలో ఎలాంటి నిజాలు బయటపెడుతుందనే విషయం ప్రతి ఒక్కరిలో చర్చనీయాంశంగా మారింది. అయితే జనాల్లో మంచి భావన కలిగేలా రియా PR టీమ్ ఫ్రెండ్లీ న్యూస్ ఛానెల్స్ తో ఒక ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

ఒక టాప్ డైరెక్టర్ తో రియాకు సంబంధం ఉన్నట్లు గత కొంత కాలంగా రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో వారిపై విమర్శలు ఎక్కువగా వస్తుండడంతో రియా ఒక ప్రముఖ నేషనల్ జర్నలిస్ట్ తో కలిసి ఒప్పందం కుదుర్చుకున్నట్లు రిపబ్లిక్ టీవీ తెలిపింది. రియా ఒక టాప్ డైరెక్టర్ కి ఫోన్ చేసి తనపై పాజిటివ్ గా వార్తలు రాసే జర్నలిస్ట్ కావాలని కోరినట్లు తెలుస్తోంది. అందుకోసం రియా PR టీమ్ ఫ్రెండ్లీ మీడియా అనే తరహాలో దర్శకుడి ద్వారా జర్నలిస్ట్ ని సంప్రదించారట. అతనికి ఎంత డబ్భైనా ఇవ్వడానికి రెడీ అయ్యారనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇటీవల స్టార్ దర్శకుడితో చాటింగ్ చేసుకున్న ఒక వాట్సాప్ స్క్రీన్ షాట్ ని కూడా కావాలనే లీక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ చాటింగ్ లో ఇద్దరు కూడా నార్మల్ గానే చాట్ చేసుకున్నట్లు జనాలకు తెలిసేలా చేయాలని ఆ జర్నలిస్ట్ సహాయం కోరినట్లు కథనాలు వెలువడుతున్నాయి. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే ముందు సీబీఐ విచారణలో ఎలాంటి నిజాలు బయటపడతాయో చూడాలి.