గుణశేఖర్ 200కోట్ల ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది..?

టాలీవుడ్ సీనియర్ దర్శకుల్లో ఒకరైన గుణశేఖర్ యాక్షన్ చెప్పి చాలా కాలవుతోంది. 2015లో రుద్రమదేవి అనంతరం మళ్ళీ ఆయన మరో ప్రాజెక్టును స్టార్ట్ చేయలేదు. అందుకు కారణం ఆయన సెట్ చేసుకున్న కథ. రానా దగ్గుబాటితో హిరణ్యకశిప అనే మైథలజికల్ సినిమా చేయాలని గత మూడేళ్ళ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది.

నిర్మాత సురేష్ బాబు ఆ సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్ టెక్నలిజితో దాదాపు 200కోట్ల బడ్జెట్ తో నిర్మించాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ దెబ్బ కొట్టడంతో మళ్ళీ ఆ ప్రాజెక్ట్ పనులపై అప్డేట్ ఇవ్వలేదు. ఇక ఇటీవల గుణశేఖర్ ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వచ్చినప్పటికీ అందులో ఎలాంటి నిజం లేదని ఆయనే క్లారిటీ ఇచ్చారు. తన తదుపరి సినిమాపై త్వరలోనే ఒక అప్డేట్ ఉంటుందని కూడా అన్నారు. మరి ఆ అప్డేట్ ఆడియెన్స్ ని ఎంతవరకు కనెక్ట్ చేస్తుందో చూడాలి.