బాలీవుడ్‌లోకి వినాయక్ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు వి.వి. వినాయక్. అప్పట్లో స్టార్ హీరోల అందరితో సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందాడు. ఆయన తీసిన ఎన్నో సినిమాలు అప్పటి హీరోలకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టాయి. చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో అప్పట్లో వినాయక్ సినిమా తీస్తున్నాడంటే.. ఆ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. మాస్ సినిమాలకు వినాయక్ కేరాఫ్ అడ్రస్ అని చెబుతారు.

vinayak

ఇప్పుడు యంగ్ డైరెక్టర్లు తెరపైకి రావడంతో సినిమాలు తగ్గించేశాడు వినాయక్. అయితే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు వినాయక్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలుగులో రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాను బాలీవుడ్‌లోకి రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించనుండగా.. ఆ సినిమాతో అతడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.

ఈ సినిమాను బాలీవుడ్‌లో వినాయక్ తెరకెక్కించనున్నాడని సమాచారం. ముందుగా సాహో సుజీత్ అని అనుకున్నారు. కానీ చివరికి వినాయక్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గతంలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో వినాయక్ తీసిన అల్లుడు శ్రీను సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో వీరిద్దరి కాంబోలో హిందీలో ఛత్రపతి రీమేక్ తెరకెక్కబోతోందట.