Tollywood: జాతి ర‌త్నాలు డైరెక్ట‌ర్‌తో వైష్ణ‌వ్ తేజ్ ..

Tollywood: మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్‌తేజ్ ఉప్పెన చిత్రంతో బారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకున్నాడు. దీంతో డెబ్యూ హీరోగా వైష్ణ‌వ్ రికార్డు సృష్టించాడు. టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను, సినీ ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు వైష్ణ‌వ్‌తేజ్‌. దీంతో వైష్ణ‌వ్ వ‌రుస సినిమాల‌తో ఫుల్ జోష్ మీదున్నాడు. ఉప్పెన చిత్రం సెట్స్‌పై ఉండ‌గానే.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ డైరెక్ష‌న్‌లో చేసే అవ‌కాశం ద‌క్కించుకున్నాడు వైష్ణ‌వ్‌… ఇప్పుడు ప్ర‌స్తుతం ఈ Tollywood చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గా..

ఇందులో వైష్ణ‌వ్‌కు జోడీగా ఫిట్‌నెస్ బ్యూటీ ర‌కుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక తాజాగా వైష్ణ‌వ్ మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. జాతిర‌త్నాలు మూవీతో భారీ విజ‌యాన్ని అందుకున్న డైరెక్ట‌ర్ అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించే చిత్రంలో వైష్ణ‌వ్ చేయ‌నున్నాడ‌ట‌. ఈ చిత్రాన్ని Tollywood ప్ర‌ముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది.. త్వ‌ర‌లో ఈ సినిమా అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది.‌‌