Vijayashanthi: క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్న రాములమ్మ‌..

Vijayashanthi: క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ దేశంలో విజృంభిస్తుంది.. ఈ నేప‌థ్యంలో క‌రోనా కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి.. ఈ క్ర‌మంలో సామాన్యుల నుంచి ప‌లువురు ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డుతున్నారు.. అయితే దీని నుంచి కాపాడుకునేందుకు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియను వేగ‌వంతం చేసింది ప్ర‌భుత్వం. ఈ నేప‌థ్యంలోనే ప‌లువురు సినీ, రాజ‌కీయ‌ ప్ర‌ముఖులు క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నారు. ప్ర‌ధాని మోదీతో పాటు క‌మ‌ల్‌హాస‌న్‌, మంచు మోహ‌న్ బాబు, నాగార్జున అక్కినేని వంటి ప్ర‌ముఖులు క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నారు. కాగా తాజాగా టాలీవుడ్ సీనియ‌ర్ న‌టి, బీజేపీ లీడ‌ర్ విజ‌య‌శాంతి(రాముల‌మ్మ‌) క‌రోనా వ్యాక్సిన్ వేయించుకుంది.

Corona Vaccine

ఈ సంద‌ర్భంగా ఆమెVijayashanthi మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు రెండు ర‌కాలుగా మేలు జ‌రుగుతోంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోవ‌ద్దు అన్నారు. ఒక‌టి.. మ‌నం కొవిడ్ నుంచి ర‌క్ష‌ణ పొందుతాం.. రెండోవ‌ది.. మ‌న వ‌ల్ల ఇత‌రుల‌కు ఈ వైర‌స్ వ్యాపించ‌కుండా ఆప‌గ‌లుగుతాం అని వెల్ల‌డించారు రాముల‌మ్మ‌. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత భౌతిక దూరం, మాస్క్‌లు ధ‌రించ‌డం వంటి కనీస జాగ్ర‌త్త‌లు పాటించ‌డం మ‌ర్చిపోవ‌ద్దు అని ఆమె సూచించారుVijayashanthi.