Vijayashanthi: విజ‌య‌శాంతి క‌ర్త‌వ్యం చిత్రం ప్రేర‌ణ‌తో బిడ్డ‌ను పోలీసు చేసిన తండ్రి!

Vijayashanthi: ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టి, బీజేపీ లీడ‌ర్ విజ‌య‌శాంతికి కాశీబుగ్గ ఎస్ఐ కొత్తూరు శిరీష కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇటీవ‌లే రోడ్డు మీద ఓ యాచ‌కుడు మృతి చెందితే.. స్వ‌యంగా అక్క‌డ ఉండి అంత్య‌క్రియ‌లు జ‌రిపించినా ఎస్ఐ శిరీషను సోష‌ల్ మీడియా వేదిక‌గా విజ‌య‌శాంతి ఆమెను అభినందించారు. ఈ నేప‌థ్యంలోనే శిరీష తండ్రి స్పందిస్తూ.. విజ‌య‌శాంతి గారు మీరు న‌టించిన క‌ర్త‌వ్యం సినిమా ప్రేర‌ణ‌తోనే త‌న‌ బిడ్డ‌ను పోలీసు ఆఫీస‌ర్‌ను చేశాన‌ని ఆయ‌న తెలిపాడు.

దీంతో Vijayashanthiవిజ‌య‌శాంతి మ‌రో ట్వీట్ చేస్తూ.. తాను న‌టించిన క‌ర్త‌వ్యం సినిమా ఒక తండ్రికి ప్రేర‌ణ‌నిచ్చి,త‌న కూతురిని స‌మాజం మెచ్చే పోలీసు అధికారిణిగా తీర్చిదిద్ద‌డం త‌న‌కెంతో సంతోషం క‌లిగిస్తుంద‌ని అన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. ధైర్యంగా ఎదుర్కొని విధి నిర్వ‌హ‌ణ‌లో ముందుకు సాగుతున్న కాశీబుగ్గ ఎస్ఐ శిరీష‌కు నా అభినంద‌న‌లు అంటూ తెలిపింది Vijayashanthi విజ‌య‌శాంతి. గ‌తేడాది విజ‌య‌శాంతి టాలీవుడ్ రీఎంట్రీ ఇచ్చిన స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించి ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. త‌ర్వాత త‌న‌కు ప‌లు చిత్రాల్లో న‌టించే అవ‌కాశాలు వ‌చ్చిన‌ప్ప‌టీకీ.. ముఖ్యంగా చిరంజీవి సినిమాలో అవ‌కాశాన్ని వ‌దులుకుంది Vijayashanthi విజ‌య‌శాంతి.. వీటికి కార‌ణం ఆమె బీజేపీ పార్టీలో చేరుతుండ‌డంతో.. రాజ‌కీయాల్లోనే ప్ర‌జ‌ల‌కు సేవ‌లు చేయాల‌నే ఉద్దేశ్యంతో సినిమా అవ‌కాశాలు వ‌ద్ద‌నుకుందిVijayashanthi.