HYD MAYOR VIJAYALASKHMI: హైదరాబాద్ మేయర్‌గా విజయలక్ష్మి

HYD MAYOR VIJAYALASKHMI: జీహెచ్‌ఎంపీ మేయర్‌గా బంజారాహిల్స్ టీఆర్‌ఎస్ కార్పొరేటర్, సీనియర్ నేత కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. ఇవాళ జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నిక జరిగింది. బీజేపీ నుంచి రాధ ధీరజ్ రెడ్డి నామినేషన్ వేయగా.. టీఆర్‌ఎస్ నుంచి విజయలక్ష్మి నామినేషన్ వేశారు. ఈ క్రమంలో మేయర్ ఎన్నిక నిర్వహించగా.. జీహెచ్‌ఎంసీ మేయర్‌గా విజయలక్ష్మి ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థికే ఎంఐఎం పార్టీ మద్దతు తెలిపింది.

VIJAYALASKHMI HYD NEW MAYOR

విజయలక్ష్మి గతంలో రెండుసార్లు బంజారాహిల్స్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 56 డివిజన్లు గెలవగా.. బీజేపీ 48 డివిజన్లు గెలిచింది. ఇక ఎంఐఎం 44 డివిజన్లలో గెలుపొందింది. ఎంఐఎం మద్దతు ఇవ్వడంతో టీఆర్‌ఎస్ మేయర్ పీఠాన్ని గెలుచుకోగలిగింది.