Vijay sethupathi: పిశాచి-2 లో గెస్ట్‌రోల్‌గా విజ‌య్‌సేతుప‌తి..

Vijay sethupathi: ప్ర‌ముఖ కోలీవుడ్ స్టార్ విజ‌య్‌సేతుప‌తి త‌న న‌ట‌న‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్నాడు. త‌మిల్‌లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో నటించి ప్రేక్ష‌కుల నుంచి ఎంతో గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాగే త‌మిల్ తో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ వంటి చిత్రాల్లో న‌టించి త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్నాడు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి, సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ధీటుగా అభిమానుల‌ను సంపాదించుకున్నాడు విజ‌య్‌సేతుప‌తిVijay sethupathi.

vijay sethupathi latest

ఇటీవ‌లే తెలుగులో వచ్చిన ఉప్పెన చిత్రంలో విల‌న్ పాత్ర‌ను పోషించ‌గా.. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎంతో ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో విజ‌య్ సేతుప‌తి తెలుగు ప్రేక్ష‌కులకు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. ఇక తాజాగా ఆయ‌న నుంచి స‌రికొత్త అప్‌డేట్ వ‌చ్చింది. గ‌తంలో మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన పిశాసు తెలుగులో పిశాచి చిత్రానికి సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో గెస్ట్ రోల్ కోసం Vijay sethupathiవిజ‌య్ సేతుప‌తిని అడిగార‌ట చిత్ర‌బృందం. త‌న పాత్ర న‌చ్చ‌డంతో వెంట‌నే ఈ చిత్రం చేయ‌డానికి ఒప్పుకున్నాడు. త్వ‌ర‌లోనే ఈ చిత్ర షూటింగ్ లో విజ‌య్ సేతుప‌తి జాయిన్ కాబోతున్నాడ‌ని తెలుస్తోందిVijay sethupathi.