Kollywood: విజ‌య్ సేతుప‌తికి ఆక‌లి తీర్చిన డైరెక్ట‌ర్ మృతి.. ఫ్యాన్స్ కామెంట్స్‌!

Kollywood: కోలీవుడ్ ప్ర‌ముఖ స్టార్ హీరో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి అంటే ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.. సినీ ఇండ‌స్ట్రీలో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌కు గుర్తింపు తీసుకుచ్చిన న‌టుడు విజ‌య్ సేతుప‌తి. ఏ పాత్ర అయినా అల‌వోక‌గా న‌టించే స‌త్తా ఉన్నా న‌టుడిగా ప్రేక్ష‌కుల్లో గుర్తింపు పొందాడు.. ఇటీవ‌లే తాను విల‌న్‌గా న‌టించిన తెలుగు ఉప్పెన‌. త‌మిళ్ మాస్ట‌ర్ చిత్రాలు భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకున్నాయి. అయితే అస‌లు ఈ స్థాయికి రావ‌డానికి విజ‌య్ సేతుప‌తి ఎన్నో బాధ‌లు ఎదుర్కొన్నాడు. సినిమాల్లో న‌టించాల‌ని అనేక‌మైన బాధ‌ల‌ను చ‌వి చూశాడు. ఆక‌లికి అవ‌స్థ‌లు ప‌డిన సంద‌ర్భాలు క‌న్నీళ్లు దిగ‌మించిన ప‌రిస్థితులు ఉన్నాయి.

Vijaysethupathi news

ఇలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నా విజ‌య్ సేతుప‌తిని Kollywood డైరెక్ట‌ర్ ఎస్‌.పి. జ‌న‌నాథ‌న్ ఆదుకున్నారు. క‌ష్ట స‌మ‌యంలో భోజ‌నాలు కూడా పెట్టించాడు.. ఆ ద‌ర్శ‌కుడే ఈ నెల 14న బ్రెయిన్ స్ట్రోక్‌తో ప్రాణాలు విడిచారు. అయితే ఈ విష‌యాన్ని తెలుసుకున్న విజ‌య్ సేతుప‌తి వెంట‌నే ఆయ‌న ఇంటికి చేరుకుని అంతిమ కార్య‌క్ర‌మాలు అయిపోయింత వ‌ర‌కు ద‌గ్గ‌రుండి కుటుంబ‌స‌భ్యుడిలా అక్క‌డే ఉన్నారు. విజ‌య్ సేతుప‌తి అంటే ఒక మంచి న‌టుడే కాదు సామాజిక స్పృహ ఉన్న వ్య‌క్తి ..ఆదుకున్న మ‌నిషిని మ‌ర్చిపోలేని వ్య‌క్తి అని.. సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.