Tollywood: విక్ట‌రీ వెంక‌టేశ్ దృశ్యం2 షూట్ ప్రారంభం..

Tollywood: విక్ట‌రీ వెంక‌టేశ్ గ‌తంలో దృశ్యం సినిమా చేసి ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇందులో వెంక‌టేశ్ చేసిన న‌ట‌నకు ప్రేక్ష‌కులు ఎంతో ఫిదా అయ్యారు. అలాగే వెంక‌టేష్ భార్య‌గా అల‌నాటి తార మీనా న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంది. మ‌ల‌యాళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ అయినా దృశ్యం చిత్రానికి ఇది రీమేక్‌గా వ‌చ్చింది.. ఇందులో మ‌ల‌యాళ ప్ర‌ముఖ న‌టుడు మోహ‌న్‌లాల్ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో న‌టించ‌గా.. మీనా కూడా మోహ‌న్‌లాల్ భార్య‌గా న‌టించింది.. ఇక వీరి కాంబినేష‌న్‌లో దృశ్యం2 ఓటీటీలో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది.

కాగా ఈ క్ర‌మంలో Tollywoodతెలుగు దృశ్యం-2 కోసం విక్ట‌రీ వెంక‌టేశ్ రంగంలోకి దిగారు. దృశ్యం మొద‌టి భాగానికి శ్రీ‌ప్రియ ద‌ర్శ‌క‌త్వం వహించినా.. ప్ర‌స్తుత సీక్వెల్‌కు మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు జీతూ జోసెఫ్ తెలుగు దృశ్యం-2కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. దీనికి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాన్ని హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు.. మార్చి 5నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంద‌ని చిత్ర‌బృందం తెలిపింది. ఇక ఈTollywood చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్ధ సురేశ్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై నిర్మాత సురేశ్‌బాబు నిర్మిస్తున్నాడు. విక్ట‌రీ వెంక‌టేశ్ ప్ర‌స్తుతం ఎఫ్‌-3, నార‌ప్ప చిత్రాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఈ చిత్రాల షూటింగ్స్ తుది ద‌శ‌కు చేరుకున్నాయ‌ని.. త్వ‌ర‌లో ఈTollywood చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి ఆయా చిత్ర‌బృందాలు ప్ర‌క‌టించారు.