‘వరుడు కావలెను‘ నుంచి మరో అప్డేట్

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను‘. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాలోని ఒక సాంగర్‌ను విడుదల చేసింది.

varudu kavalenu song

‘‘కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా
నీలి మబ్బుల్లో నేనే తేలేంతలా
కొంటె నవ్వే అలా చంపుతుంటే ఎలా
కొత్త రంగుల్లో ప్రాణమే తడిసేంతలా
మళ్ళీ మళ్ళీ రావే పూలజల్లు తేవే‘‘ అనే సాహిత్యంతో సాగే ఈ గీతాన్ని గీత రచయిత రాంబాబు గోసల రచించారు. ప్రఖ్యాత గాయకుడు సిద్ శ్రీరామ్ మరోసారి వీనుల విందుగా ఆలపించిన ఈ గీతానికి విశాల్ చంద్రశేఖర్ స్వరాలు ప్రాణం పోశాయి. చిత్ర నాయకా నాయికలు మధ్య ప్రేమ కు తెర రూపం గా ఈ గీతం కనిపిస్తుంది. సంగీతం, సాహిత్యం, స్వరం ఈ పాటలో పోటీ పడ్డాయనిపిస్తుంది. వీటికి తోడు ‘నాగ శౌర్య, రీతువర్మ‘ లు అభినయం కట్టిపడేస్తుంది.

గీతాన్ని ఆలపించిన గాయకుడు సిద్ శ్రీరామ్ మాట్లాడుతూ..‘ చిత్ర సంగీత దర్శకులు విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమ కూర్చిన ఈ శ్రావ్య మైన గీతాన్ని ఆలపించటం ఎంతో ఆనందంగా ఉంది. ప్రేమికుల దినోత్సవం రోజున ఈ గీతం సంగీత ప్రియులకు చేరువ కావటం మరెంతో సంతోషం గా ఉందన్నారు.

ఇంతకుముందు చిత్రం పేరును అధికారిక ప్రకటన చేస్తూ ఓ వీడియో, ఆ తరువాత 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ.. ఓ ప్రచారచిత్రం, కథానాయకుడు నాగ శౌర్య పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన వీడియో వంటి ప్రచారాలకు ప్రేక్షకాభిమానులనుంచి ఎన్నో ప్రశంసలు కూడా లభించాయి. సామాజిక మాధ్యమాలలో కూడా వీటికి ప్రాచుర్యం లభించింది .. ప్రస్తుతం చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘వరుడు కావలెను‘ చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు,నటీ నటుల అభినయాలు చిత్ర కథా నుగుణంగా సాగి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి అన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.