Tollywood: వ‌కీల్‌సాబ్‌, రాధేశ్యామ్ రిలీజ్ డేట్స్ ఎప్పుడు మ‌రీ..

Tollywood: తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ 2021సంవ‌త్స‌రం ఎంతో క‌ళ‌క‌ళ‌లాడుతుంద‌నే చెప్పాలి. ఎందుకంటే.. జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి.. సంక్రాంతి కానుక‌గా వ‌రుస‌గా సినిమాలు రిలీజ్ అయ్యి మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి.. క్రాక్ చిత్రం అఖండ విజ‌యం సాధించింది. తేజ్ సోలో బ్ర‌తుకే బెట‌ర్‌, రామ్ రెడ్ సినిమా, బెల్లంకొండ శ్రీ‌నివాస్ న‌టించిన అల్లుడు అదుర్స్ చిత్రాలు ప్రేక్ష‌కుల నుంచి మంచి టాక్‌నే సంపాదించుకున్నాయి.

pawan-prabhas

Tollywood ఇలా టాలీవుడ్‌కు ఈ ఏడాది ప్రారంభంలోనే మంచి శుభ‌ప‌రిణామాలు చ‌విచూసింది. ఇక మ‌రోవైపు సినిమా రిలీజ్ డేట్స్‌తో అప్‌డేట్స్ ఇస్తూ సినీ ప్రేక్ష‌కులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. Tollywood అలా ఇప్ప‌టివ‌ర‌కు ఆర్ఆర్ఆర్ అక్టోబ‌ర్ 13వ తేదీన‌, ఆచార్య మే 13వ తేదీన‌, నార‌ప్ప మే 14వ తేదీన‌, పుష్ప అగ‌ష్టు 13వ తేదీన‌, గని తోపాటు కేజీఎఫ్‌-2 విడుద‌ల తేదీల‌ను ప్ర‌క‌టించారు. అయితే ఇక్క‌డి వ‌ర‌కు అంతా బాగానే ఉంది. కానీ అస‌లైన సినిమాల కోసం సినిమా ప్రేక్ష‌కులు ఎంతో ఎదురుచూస్తున్నారు. ఇంత‌కీ ఆ సినిమాలు ఏంటా.. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ న‌టించిన వ‌కీల్‌సాబ్‌, మ‌రో సినిమా యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ న‌టించిన‌ రాధేశ్యామ్ చిత్రాల రిలీజ్ డేట్స్ ఇంకా వెల్ల‌డించ‌లేదు.Tollywood ఇటీవ‌లే రిలీజ్ చేసిన‌ వ‌కీల్‌సాబ్ టీజ‌ర్ అభిమానుల్లో, సినీ ప్రేక్ష‌కుల్లో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు క్రియేట్ చేసింది. కానీ ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే వ‌కీల్‌సాబ్ రిలీజ్ డేట్‌ను త్వ‌ర‌గా ప్ర‌క‌టన చేయాల‌ని ప‌వ‌న్‌ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే ప్ర‌భాస్ న‌టించిన రాధేశ్యామ్ చిత్రం అప్‌డేట్ కోసం అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకోగా.. కానీ ఇంత‌వ‌ర‌కు చిత్ర‌బృందం నుంచి ఎలాంటి అప్‌డేట్ రాక‌పోవ‌డంతో ఫ్యాన్స్ నిరాశ‌కు గుర‌వుతున్నారు. దీనిపై వెంట‌నే చిత్ర‌బృందం స్పందించి రాధేశ్యామ్ నుంచి అప్‌డేట్ ఇవ్వండ‌ని కోరుకుంటున్నారు ఫ్యాన్స్‌.

‌‌