ఉప్పెన కథ ముందు ఎన్టీఆర్‌కి చెప్పారట

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోా నటించిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ కావడంతో.. సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను నిన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా సినిమా యూనిట్ విడుదల చేయించింది.

UPPENA STORY NTR

ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. తాను మొదట ఈ కథను ఎన్టీఆర్‌కు చెప్పానని చెప్పాడు. ఇప్పుడు ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదల కావడం ఆనందంగా ఉందన్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎన్టీఆర్ ఫోన్ చేసి ఎలా వస్తోందని అడిగేవారని, ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ సినిమా ప్రయాణం చేశానన్నాడు.

ఈ నెల 12న ఉప్పెన థియేటర్లలో విడుదల కానుంది.సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.