Khammam: ఖ‌మ్మంలో ఉప్పెన జంట.. క‌న్ను కొట్టి ఫ్యాన్స్‌తో సెల్ఫీ దిగిన కృతి!

Khammam: మెగా హీరో వైష్ణ‌వ్‌తేజ్‌, కృతిశెట్టి హీరోహీరోయిన్ల్‌గా ఉప్పెన చిత్రం తెర‌కెక్కి బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని అందుకున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సుకుమార్ ద‌గ్గర ప‌నిచేసిన బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో ప్ర‌ముఖ కోలీవుడ్ స్టార్ మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి ప్ర‌తి నాయ‌కుడిగా న‌టిండంతో ఈ సినిమా మ‌రింత గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంతో వైష్ణ‌వ్ టాలీవుడ్ ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే కృతి త‌న అందం, అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసింది.

Uppena HeroHeroins

కాగా Khammam ఖ‌మ్మంలోని కేఎల్ఎం షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వైష్ణ‌వ్‌-కృతి ముఖ్య అతిథుల‌గా హ‌జ‌రై షోరూంను ప్రారంభించారు. వీరిని చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు త‌ర‌లివ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో కృతి ఫ్యాన్స్‌తో క‌లిసి ఫోటో దిగారు. అందులో కృతి క‌న్ను గీటుతూ క‌నిపిస్తుంది.. అలాగే వైష్ణ‌వ్ కూడా ఉన్నాడు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.‌