సరిలేరు తర్వాత మహేశ్ బాబు ఎవరిని ఫైనల్ చేస్తాడో?

సరిలేరు నీకెవ్వరూ సినిమాతో బిజీగా ఉన్న మహేశ్ బాబు, ఈ మూవీ అయ్యాక ఎవరితో వర్క్ చేస్తాడు అంటే ఘట్టమనేని అభిమానులే కాదు ఇండస్ట్రీ వర్గాలు కూడా డౌట్ గానే ఆన్సర్ ఇస్తారు. అంత కన్ఫ్యూజ్ చేస్తున్న మహేశ్, సరిలేరు అయ్యాక కొంచెం గ్యాప్ తీసుకోనున్నాడు. ఇదిలా ఉంటే మహేశ్ తో సినిమా చేయడానికి ఇద్దరు డైరెక్టర్స్ పోటీ పడుతున్నారు. అందులో ఒకరు ఇప్పటికే మహర్షి రూపంలో మహేశ్ కి బెంచ్ మార్క్ మూవీ ఇచ్చిన వంశీ పైడిపల్లి కాగా మరొకరు ప్రశాంత్ నీల్. మహర్షి చేసే టైంలోనే సూపర్ స్టార్ తో ఇంకో సినిమా ఉంటుందని చెప్పేసిన వంశీ పైడిపల్లి, మళ్లీ కథని రెడీ చేశాడని త్వరలోనే మహేశ్ కి వినిపించనున్నాడని తెలుస్తోంది.

mahesh babu

కేజీఎఫ్ సినిమాతో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ప్రశాంత్ నీల్, మహేశ్ తో పాన్ ఇండియా మూవీ చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే లైన్ కూడా చెప్పాడని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న సమాచారం. వంశీ పైడిపల్లి సినిమా రీజినల్ సబ్జెక్ట్ అవుతుంది కానీ ప్రశాంత్ నీల్ సినిమా అనగానే పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న అనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా కేజీఎఫ్ తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి హైప్ ఇంకా ఎక్కువగా ఉంటుంది.

అయితే ఇప్పటివరకూ యష్ ని తప్ప స్టార్స్ ని హ్యాండిల్ చేయని ప్రశాంత్ నీల్ మహేశ్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనే డౌట్ కూడా ఉంది. ఎందుకంటే ఎంత గొప్ప సినిమా చేసినా, ఒక స్టార్ ని హ్యాండిల్ చేసే అప్పుడు చాలా విషయాలు పట్టించుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో వంశీ పైడిపల్లికి చాలా ఎక్స్పీఎరియన్స్ ఉంది. ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రభాస్ నాగార్జున లాంటి హీరోలని వంశీ చూపించిన విధానం కొత్త ఉంటుంది. 24 సినిమాలు చేసిన మహేశ్ ని కూడా 25వ చిత్రంలో ఒక సీఈఓ టర్న్డ్ ఫార్మర్ గా వంశీ రాసుకున్న కథనం మహర్షిని నడిపించింది. మరి తన కోసం పోటీ పడుతున్న ఈ డైరెక్టర్స్ లో మహేశ్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో తెలియాలి అంటే మరికొన్ని నెలలు ఆగాలి.