టాలీవుడ్‌లో మరో విషాదం.. ‘పుష్ప’ స్టిల్ ఫోటోగ్రాఫర్ మృతి

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. తాజాగా ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ గోపిశెట్టి శ్రీనివాస్ మరణించారు. ఈ రోజు రాత్రి ఒంటి గంట సమయంలో రాజమండ్రిలో గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప సినిమాకు శ్రీనివాస్ పనిచేస్తున్నారు. పుష్ప షూటింగ్ నిమిత్తం మారేడుపల్లి వెళ్లగా.. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో లొకేషన్‌లోని అంబులెన్స్‌లో రాజమండ్రి తీసుకెళుతుడగా మరణించారు.

still photographer srinivas died

శ్రీనివాస్ వయస్సు 54 సంవత్సరాలు. 250పైగా సినిమాలకు ఆయన స్టిల్ ఫోటోగ్రాఫర్ గా పనిచేశారు,
ఆయనకు భార్య, ఇద్దరు కుమర్తెలున్నారు. 1922వ సంవత్సరంలో విడుదలైన విముక్తికోసం సినిమా ద్వారా స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా శ్రీనివాస్ సినీ అరగ్రేటం చేశారు. గతంలో సినీ స్టిల్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్‌కి 6 సంవత్సరాలు ట్రెజరర్‌గా, 2 సంవత్సరాలు ప్రెసిడెంట్‌గా శ్రీనివాస్ పనిచేశారు. శ్రీనివాస్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.