ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రసాద్ బాబు కన్నుమూత

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 50 కి పైగా సినిమాలకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా, పలు చిత్రాలకు మేనేజర్ గా పని చేసిన బండారు ప్రసాద్ బాబు(57) గురువారం కన్నుమూశారు. హైదరాబాద్ లోని సన్ షైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య అంజలి, వినయ్ కుమార్, మురళీమోహన్ ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రసాద్ బాబు మృతి పట్ల సినీ పరిశ్రమ సంతాపం ప్రకటించింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది.